Home > ఆంధ్రప్రదేశ్ > కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి
X

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 8 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు చిక్‌బళ్లాపూర్‌ పోలీసు అధికారి నాగేశ్‌ తెలిపారు.

దసరా పండగకు కూలీలంతా సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హొంగసంద్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పొగమంచు ఉండటంతో డ్రైవర్‌ నరసింహులు.. ఆగి ఉన్న ట్యాంకర్‌ గమనించకుండా ఢీ కొట్టాడు. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. ఏడుగురు చిక్‌బళ్లాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన ఒక పురుషుడు, ఒక స్త్రీ పరిస్థితి విషమంగా ఉందని చిక్‌బళ్లాపూర్‌ పోలీసు అధికారి నాగేశ్‌ తెలిపారు.




Updated : 26 Oct 2023 5:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top