Home > ఆంధ్రప్రదేశ్ > Road Accident : ఎంతటి విషాదం.. కన్నీరు పెట్టించే సుభాష్‌ కథ

Road Accident : ఎంతటి విషాదం.. కన్నీరు పెట్టించే సుభాష్‌ కథ

Road Accident : ఎంతటి విషాదం.. కన్నీరు పెట్టించే సుభాష్‌ కథ
X

సామాజిక మాధ్యమాల్లో చిగురించిన ప్రేమ.. నాలుగేళ్లు గా సాగిన ప్రేమాయణం. చివరకు పెద్దల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. వారి బంధానికి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. కానీ అన్యోన్యంగా సాగుతున్న వాళ్ళ బంధాన్ని విధి వెక్కిరించింది. ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని మింగేసింది. కన్నీళ్ళ పెట్టించే ఈ విషాదాంతమైన కథెంటో ఓ సారి చూస్తే..

సంగారెడ్డి జిల్లాకు చెందిన సుభాష్‌ గౌడ్‌ సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన దివ్యప్రియను 2020 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత వారికి ఓ బిడ్డ పుట్టింది. నూతన సంవత్సరం సందర్భంగా సుభాష్‌ గౌడ్‌ భార్య, కుమార్తె తల్లి రమాదేవి, బావ మల్లిఖార్జున,చెల్లి స్వప్న, మేనల్లుడు వికాశ్‌సాయితో కలిసి ఈ నెల 30న విశాఖపట్నంలోని అత్తగారి ఇంటికి వెళ్ళారు. అక్కడ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోని 2న తిరిగి హైదరాబాద్‌‌కు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురం జాతీయ రహదారిపై ఊహించని విధంగా ఓ కారు ఎదురుగా రావడంతో వీరి కారు కంట్రోల్‌ కాలేదు. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాయ్యాయి. సుభాష్‌ గౌడ్‌ కుటుంబంలో ఆయన తల్లి, భార్య, కూతురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో సుభాష్‌ గౌడ్‌ తీవ్రంగా గాయపడడంతో దేవరపల్లి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. భార్య, కుమార్తె, తల్లి చనిపోయిన విషయం తెలియని సుభాష్‌ గౌడ్‌ వారికి ఏమైందంటూ పదే..పదే అడుగుతుంటే బంధువులు ఏం చెప్పాలో తెలియక కన్నీరు మున్నీరు అవుతున్నారు. అందరూ బాగానే ఉన్నారని చెప్పి సుభాష్‌ గౌడ్‌‌ను బంధువులు స్వస్థలానికి తీసుకుని వెళ్ళారు.

Updated : 4 Jan 2024 5:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top