Home > ఆంధ్రప్రదేశ్ > అసలు చంద్రబాబుకు సిగ్గు ఉందా? కుళ్లి కుళ్లి చస్తాడు

అసలు చంద్రబాబుకు సిగ్గు ఉందా? కుళ్లి కుళ్లి చస్తాడు

అసలు చంద్రబాబుకు సిగ్గు ఉందా? కుళ్లి కుళ్లి చస్తాడు
X

చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలో పవన్ కళ్యాణ్ చెప్పాలని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ పోసాని కృష్ణమురళి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెనుక ఎందుకు తిరుగుతున్నారో అర్ధం కాలేదన్నారు. పవన్ లాంటి రాజకీయ నేతలను ఇంతవరకు చూడలేదన్నారు. కాపులను(మీ అన్నను) ఓడించిన చంద్రబాబును ఎందుకు గెలిపించాలని ప్రయత్నిస్తున్నారని.. పవన్ ను ప్రశ్నించారు. కాపులెంతో గొప్పవాళ్లని... వాళ్లతో తాను సినిమాలు తీసినట్టు గుర్తు చేశారు. ఏపీలో ఏం జరుగుతుందో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే తనను కూడ తిట్టిస్తారని పోసాని అన్నారు.





అసలు చంద్రబాబుకు సిగ్గు ఉందా? అని మొదలెట్టిన పోసాని.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించకపోగా.. రోజూ సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన బాగా లేదని నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటానని చెప్పారు. అమరావతిలో పేదలకు భూమి ఇస్తే.. హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొస్తారా? అని మండిపడ్డారు. జగన్ మంచి పనులు చేస్తుంటే ఏడుపెందుకు అని ప్రశ్నించారు. ‘మీ బిడ్డగా చెబుతున్నా చంద్రబాబు మాట వినకండి.. వింటే నష్టపోతారు’ అని అమరావతి రైతులను పోసాని వేడుకున్నారు.

వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు సుమారు రూ.11 వేల కోట్లను రుణ మాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు వైఎస్ఆర్ రుణమాఫీపై ఎందుకు స్టే తీసుకు రాలేదని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. అమరావతి మీ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని స్టే తీసుకు రాలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. అంతేకాదు రైతులకు ఉచితంగా విద్యుత్‌ను వైఎస్ఆర్ సర్కార్ ఇచ్చిన సమయంలో ఎందుకు కోర్టుకు వెళ్లలేదని అడిగారు.

అమరావతిలోని ఆర్-5 జోన్ లో పేదలకు జగన్ సర్కార్ ఇళ్లు కట్టిస్తాననంటే స్టే తీసుకువచ్చినట్టుగా బాబు చెప్పడంపై మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టకుండా స్టే తీసుకువచ్చిన రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను కమ్మ సామాజిక వర్గంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. తుళ్లూరు గుండా వైఎస్ జగన్ వెళ్తే అమరావతి రైతులు పసుపు నీళ్లు చల్లిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రైతుల ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాట వింటే సర్వనాశనమౌతారని రైతులకు హితవు పలికారు. ఎన్నో పాపాలు చేసిన చంద్రబాబు కుళ్లి కుళ్లి చనిపోతారన్నారు. జగన్ మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందితే తనకు, తన కొడుకుకు భవిష్యత్తు ఉండదని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. అందుకే రైతులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారని పోసాని కృష్ణమురళి విమర్శించారు. ప్రజా న్యాయస్థానంలో సీఎం జగన్ 151 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించారన్నారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడి గురించి మాట్లాడడం వేస్టన్నారు.




Updated : 4 Aug 2023 8:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top