Home > ఆంధ్రప్రదేశ్ > VijayaNagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

VijayaNagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

VijayaNagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. 14 మంది దుర్మరణం
X

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. అందులో ఇద్దరు రైల్వే సిబ్బంది కూడా ఉన్నారు. దాదాపు 100 మంది ప్యాసింజర్లు గాయపడ్డారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7: 10 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ఓ ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగింది. అదే సమయంలో దాని వెనకాలే పట్టాలు మారుతున్న విశాఖ- రాయగడ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో కరెంటు వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. ఫలితంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదం వివరాలు తెలుసుకునేందుకు రైల్వే అధికారులు హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కాగా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం నష్ట పరిహారాన్ని ప్రకటించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారుంటే.. వారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 2 లక్షల సహాయం అందించనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి మృతులకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 వేల సాయం అందించనున్నారు.

Updated : 30 Oct 2023 2:27 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top