Home > ఆంధ్రప్రదేశ్ > AP CM JAGAN : ఏపీ సీఎం అక్రమాస్తుల విచారణ కేసు వాయిదా

AP CM JAGAN : ఏపీ సీఎం అక్రమాస్తుల విచారణ కేసు వాయిదా

AP CM JAGAN  : ఏపీ సీఎం అక్రమాస్తుల విచారణ కేసు వాయిదా
X

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ గడవును తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 30 లోగా డిశ్చార్జి పిటిషన్లను తేల్చాలంటూ సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తమపై దాఖలైన అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించాలంటూ జగన్ తో పాటు మిగతా నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్లను సీబీఐ కోర్టు విచారిస్తోంది. చాలాకాలంగా ఈ విచారణ జరగుతుండడంతో తెలంగాణ హైకోర్టు కల్పించుకుంది. డిశ్చార్జి పిటిషన్లపై ఏప్రిల్ 30 లోపు విచారణ పూర్తి చేసి వెంటనే తీర్పు వెల్లడించాలని హైకోర్టు సూచించింది.

జగన్ కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లో ముగించాలని డిసెంబరు 15న సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న రికార్డులను పరిశీలించాలని తెలిపింది. అలాగే సాక్షుల వాంగ్మూలాలు సేకరించాలని సీబీఐ కోర్టు చెప్పింది. సుమారు 13వేల పేజీల డిక్టేషన్ సిద్ధంగా ఉందని సీబీఐ కోర్టు చెప్పింది. ప్రస్తుతం విచారణ చివరి దశలో ఉందని..దాని కోసం మరింత గడువు కావాలని కోరగా తెలంగాణ హై కోర్టు అనుమతినిచ్చింది.




Updated : 29 Feb 2024 8:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top