Home > ఆంధ్రప్రదేశ్ > విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
X

గత కొంతకాలంగా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలపై బహిష్కరించి ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని వారిపై వేటు వేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల అంగవ్వాడీలపై వేటు వేశారు. మన్యం జిల్లా, విజయవాడ జిల్లాలో వర్కర్లు, హెల్పర్లను తొలిగిస్తూ కలెక్టరులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేశారు. అయినా అంగన్ వాడీలు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పట్టుబడ్డారు. అంతేకాదు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.

విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అయితే వీరి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. సోమవారం తెల్లవారుజామున ధర్నా చౌక్ వద్దకు వెళ్లి అంగన్‌వాడీలను అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. కాగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలను ఇవాళ చలో విజయవాడ పిలుపునిచ్చన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడకు వెళ్లే అన్ని దారుల్లో ప్రటిష్ట నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ అంగన్‌వాడీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది.

Updated : 22 Jan 2024 6:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top