Home > ఆంధ్రప్రదేశ్ > ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 37 శాతం జీతాల పెంపు..

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 37 శాతం జీతాల పెంపు..

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 37 శాతం జీతాల పెంపు..
X

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన వేతనం ఈ నెల 11 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఏపీలో విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉ‍ద్యోగుల జీతాలు 37 శాతం పెంచడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.21 వేల జీతం దాటింది.

ఈ నిర్ణయంతో 27వేల మంది విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో సీఎం జగన్ నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యుత్ శాఖలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపుతుందని, వారికి మెరుగైన వేతనం, బీమా కవరేజీని అందజేస్తుందని భావిస్తున్నారు.

ఇక తాజా ఉత్తర్వులతో .. హై స్కిల్డ్ ఉద్యోగికి రూ.22,589 నుంచి రూ.30, 605కు జీతం పెరిగింది. స్కిల్డ్ ఉద్యోగికి 20,598 నుంచి రూ.27,953లకు పెంచారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగికి రూ.17,144 నుంచి రూ.23, 236 కు శాలరీ పెరిగింది. అన్ స్కిల్డ్ ఉద్యోగికి రూ.16,473 నుంచి 22,318 కు జీతం పెంచారు. జీతాల పెంపుపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చాలా కాలంగా విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతున్నారు. విధి నిర్వహణలో ఉద్యోగి మృతి చెందితే కారుణ్య నియామకం కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారు.



Updated : 16 Aug 2023 6:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top