Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Chandrababu) చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ పై సీఐడీ తరపు న్యాయవాదులు సమయం కోరడంతో ఏపీ హైకోర్టు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్కిల్‌ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో.. ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 9న జరిగింది. ఆ రోజే చంద్రబాబుకు స్కిల్ కేసులో బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ నేటికి వాయిదా పడింది. ఇవాళైనా బెయిల్ లభిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశతో ఉన్నాయి. ఇవాళ కూడా కేసు విచారణ 17కు వాయిదా పడటంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. తున్నాయి. ఇక సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. రేపయినా చంద్రబాబుకు ఊరట లభిస్తుందో లేదో చూడాలి.




Updated : 12 Oct 2023 6:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top