Home > ఆంధ్రప్రదేశ్ > YS Viveka : వైఎస్ వివేక హత్యపై అప్రూవర్‌ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

YS Viveka : వైఎస్ వివేక హత్యపై అప్రూవర్‌ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

YS Viveka  : వైఎస్ వివేక హత్యపై అప్రూవర్‌ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
X

వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా కేవలం ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని చెప్పారు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారని వాళ్ల సూచనలతోనే హత్య చేశారని తెలిపారు. జైలు అధికారులు తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయన్నారు. కడప జైల్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేశాడని చెప్పారు. ఆ సమయంలో జైల్లోని సీసీ ఫుటేజీని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. జైల్లో సీసీ కెమెరాలు పని చేసేలా చూసే బాధ్యత జైలు అధికారులదే అని చెప్పారు.

కడప జైల్లో ప్రలోభాలపై ఎస్పీ, సీబీఐ ఎస్పీలకు లేఖ రాశానని తెలిపారు. తనను చైతన్య ప్రలోభాలకు గురి చేయడంపై మీడియాలను ఆశ్రయించాలని తన భార్యకు చెప్పానని అన్నారు. జైలు అధికారులు కూడా తనను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. పులివెందుల కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కూడా తన భార్యను బెదిరించారని మండిపడ్డారు. జైలు అధికారులు ఇబ్బంది పెట్టి నాతో లేఖ రాయించు కున్నారని, సీబీఐ తలుచుకుంటే అన్నీ బయటకు వస్తాయని దస్తగిరి తెలిపారు. జై భీమ్‌ భారత్‌ తరఫున పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని వివరించారు. వివేకాను చంపిన నాకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారని, హత్య చేయించిన వ్యక్తి జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.




Updated : 5 March 2024 11:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top