Home > ఆంధ్రప్రదేశ్ > శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది..

శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది..

శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది..
X

గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ను గురువారంః విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. శుక్రవారం గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిఎస్పీ(సివిల్), ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.

ఖాళీల వివరాలు

  • ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ 9
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18
  • డీఎస్పీ (సివిల్‌) 26
  • రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6
  • కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటి రిజిస్ట్రార్‌ 5
  • జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3,
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2
  • జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్‌ 1
  • జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ 1
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II 1
  • అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 1

పూర్తి వివరాలకు psc.ap.gov.in

ఇది కూడా చదవండి..

Breaking News:గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

Updated : 8 Dec 2023 3:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top