Home > ఆంధ్రప్రదేశ్ > Kishan Reddy : వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy : వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy : వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. గతంలోనూ అదే సమయంలో ఎన్నికలు జరిగాయన్నారు. ఇక మోదీ మూడోసాకి ప్రధాని అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినా, గెలిచినా తెలంగాణకు ఎటువంటి లాభం లేదని విమర్శించారు.

గతంలో ఉన్న కాంగ్రెస్ కుంభకోణాలకే కేరాఫ్ గా మారిందని కిషన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రులే అరెస్ట్ అయ్యారని చెప్పారు. కానీ గత పదేళ్లుగా మోదీ హయాంలో అవినీతి అనేదే లేదన్నారు. మతకల్లోలాలు. బాంబు పేళ్లుల్లు వంటివి అసలే లేవని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు అమలు చేస్తుందో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్ కు రూట్ మ్యాచ్ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టిందని.. కాంగ్రెస్ కు కొన్ని రోజుల సమయమిద్దామని చెప్పారు.

Updated : 21 Jan 2024 10:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top