Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : బాబాయి హత్య కేసు పై సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా?..చంద్రబాబు

Chandrababu : బాబాయి హత్య కేసు పై సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా?..చంద్రబాబు

Chandrababu : బాబాయి హత్య కేసు పై సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా?..చంద్రబాబు
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. బాబాయి హత్య కేసు పై సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఈ పాలకులకు పరిపాలించే హక్కు లేదని స్వయంగా ఆయన చెల్లెలు సునీత చెప్పారన్నారు. సోదరి పుట్టకపై సైతం చాలా దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హత్య కేసు ఏదైనా నాలుగైదు రోజుల్లో తేలిపోతుందని..కానీ

వివేక హత్య కేసు ఐదేళ్లు అయినా ఇంకా తేలలేదన్నారు. వివేకానంద రెడ్డి మొదట గుండె పోటుతో చనిపోయాడాని జగన్ చెప్పాడని తర్వాత గొడ్డలి పోటు అని తేలిందన్నారు. అంటే ముందుగానే ఆ కుట్రలో జగన్ కు భాగస్వామ్యం ఉందని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

సొంత చెల్లెలు షర్మిలతోనే జగన్ కు ఆస్తి వివాదాలున్నాయని ఆరోపించారు. షర్మిల, ఆమె పుట్టక పైనే సోషల్ మీడియాలో చాలా తప్పుగా దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ సునీత హంతకులు మన మధ్యనే ఉంటారని చెప్పారన్నారు. అహంకారంతో ఏపీని నాశనం చేసిన వ్యక్తి జగన్ అని..మనమందరం ఆయన బానిసలం అని అనుకుంటున్నారని చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే జగన్ కి ఎంటీ బాధ అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలికాచుకునే వాళ్లు వైసీపీ నేతలని దుయ్యబట్టారు. జగన్ హాయంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పారు. అన్ని కులాలకు జగన్ అన్యాయం చేశారని ఎద్దేవా చేశారు.

ఎవరికి ఇవ్వని గౌరవం పవన్ కళ్యాణ్ కు ఇస్తున్నామని...ఏపీ భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన కలిసి పని చేస్తోందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ, జనసేన పార్టీలే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.




Updated : 2 March 2024 8:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top