Home > ఆంధ్రప్రదేశ్ > రేపు ఏపీ సీఐడీ ఆఫీసుకు చంద్రబాబు

రేపు ఏపీ సీఐడీ ఆఫీసుకు చంద్రబాబు

రేపు ఏపీ సీఐడీ ఆఫీసుకు చంద్రబాబు
X

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఏపీ హైకోర్టు ఆయనకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. వారం రోజుల్లోగా సీఐడీకి పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. దీంతో రేపు ఆయన పూచీకత్తును సమర్పించేందుకు సీఐడీ ఆఫీసుకు వెళ్తున్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ కోసం బాబు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఆ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. కాగా మద్యం కోసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది.


Updated : 12 Jan 2024 10:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top