Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : చంద్రబాబు పిటిషన్‌ విచారణ నుంచి వైదొలగిన జడ్జి

Chandrababu : చంద్రబాబు పిటిషన్‌ విచారణ నుంచి వైదొలగిన జడ్జి

Chandrababu : చంద్రబాబు పిటిషన్‌ విచారణ నుంచి వైదొలగిన జడ్జి
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ అనుబంధ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ముందుకు 8వ కేసుగా విచారణకు వచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మాయి ప్రతాప్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేయాల్సి ఉండగా.. కేసు విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అంటూ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకొన్నారు.ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా తాను అధ్యయనం చేయాల్సి ఉన్న నేపథ్యంలో వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ బెంచ్ ఈనెల 30న విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు చర్మ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా కంటి సమస్యలతో బాధపడుతున్నారని.. ఆపరేషన్ చేయాల్సి ఉందని హౌస్ మోషన్ పిటిషన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్లపై ఈనెల 30న విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.




Updated : 27 Oct 2023 6:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top