Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : రూ.4400 కోట్ల భూముల స్కామ్.. చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్

Chandrababu : రూ.4400 కోట్ల భూముల స్కామ్.. చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్

Chandrababu : రూ.4400 కోట్ల భూముల స్కామ్.. చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్
X

అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేయగా రూ.4400 కోట్ల భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ నిర్థారించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబును చేర్చన సీఐడీ మాజీ మంత్రి నారాయణను మరో ముద్దాయిగా పేర్కొంది.మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ తెలిపింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తేల్చింది.అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధారించింది.

చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ గుర్తించింది.రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చేసింది. చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తేల్చింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు 53 రోజుల జైలు జీవితాన్ని గడిపిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ సీఐడీ ప్రధాన ముద్దాయిగా చార్జిషీట్ విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.




Updated : 11 March 2024 1:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top