Home > ఆంధ్రప్రదేశ్ > మేనల్లుడి నిశ్చితార్ధానికి హాజరుకానున్న సీఎం జగన్

మేనల్లుడి నిశ్చితార్ధానికి హాజరుకానున్న సీఎం జగన్

మేనల్లుడి నిశ్చితార్ధానికి హాజరుకానున్న సీఎం జగన్
X

వైఎస్ షర్మిల ప్రస్తుతం తన కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 17న తన కొడుకు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం జరగనుంది. ఈ క్రమంలో షర్మిల వెడ్డింగ్ కార్డుల పంపిణీలో బిజీగా ఉన్నారు. సీఎంలు జగన్, రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులను షర్మిల పెళ్లికి ఆహ్వానించారు. కాగా గురువారం రాజారెడ్డి - ప్రియ ఎంగేజ్మెంట్ జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిస్టార్ట్లో ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహిస్తున్నారు.

మేనల్లుడి ఎంగేజ్మెంట్కు సీఎం జగన్ హాజరుకానున్నారు. గురువారం సాయంత్రం 6.15కు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి 7.30కి శంషాబాద్ చేరుకోనున్నారు. 8 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగే రిస్టార్ట్కు చేరుకుంటారు. తిరిగి 10.10కి తాడేపల్లి వెళ్తారు. గత కొంత కాలంగా జగన్ - షర్మిల అంటిముట్టన్నట్లుగా ఉంటున్నారు. షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ స్థాపించగా.. ఇటీవలే ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ క్రమంలో హైకమాండ్ ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పింది. అయితే అన్నను జైలుకు పంపిన పార్టీలో చేరిందని షర్మిలపై వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.

Updated : 17 Jan 2024 4:29 PM GMT
Tags:    
Next Story
Share it
Top