Home > ఆంధ్రప్రదేశ్ > వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ పెడతా: మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ పెడతా: మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ పెడతా:  మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
X

ఏపీలో మరో కొత్త పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ .. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని మీడియా ముఖంగా తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందే అని అన్నారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ ఫేర్‌కు 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. అక్కడే ఆఫర్ లెటర్‌లు కూడా ఇస్తామని చెప్పారు. కొంచె వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ ఫేర్‌కు హాజరు కావచ్చని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ నుంచి పోటీ చేస్తానని చెబుతూనే.. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందనడం చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని చెప్పారు.. ఇప్పుడు ఉన్నట్గుండి కొత్త పార్టీని తెరపైకి తీసుకురావడం విశేషం. జేడీ లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు జనసేనన పార్టీలోచేరారు. విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.. ఎన్నికల ఫలితాల తర్వాత లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు.

Updated : 29 Nov 2023 7:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top