Home > ఆంధ్రప్రదేశ్ > లోకేష్ సమర్థుడైతే మహిళలు రోడ్లపైకి ఎందుకొస్తారు.. కొడాలి నాని

లోకేష్ సమర్థుడైతే మహిళలు రోడ్లపైకి ఎందుకొస్తారు.. కొడాలి నాని

లోకేష్ సమర్థుడైతే మహిళలు రోడ్లపైకి ఎందుకొస్తారు.. కొడాలి నాని
X

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాడు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది’’ అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు? భువనేశ్వరి ఏ స్థాయిలో ఉందని ప్రశ్నించారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ. 2 వేల కోట్లు దాటిందన్నారు కొడాలి నాని.

40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ. 35 కోట్ల ఫీజులు ఏ విధంగా కట్టారని కొడాలి నాని ప్రశ్నించారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెరవనుక నుంచి టీడీపీకి మద్దతుగా ఉన్నాడని.. అయితే ఇప్పుడు ముసుగు తొలగింది అంతేనని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జనసున్నా పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు, మగాడు అయితే ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని.. ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి నిజం గెలవాలి పేరుతో యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు.




Updated : 25 Oct 2023 6:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top