Home > ఆంధ్రప్రదేశ్ > Achchennaidu : ఏపీలో హెల్త్ ఎమెర్జెన్సీ.. సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు లేఖ

Achchennaidu : ఏపీలో హెల్త్ ఎమెర్జెన్సీ.. సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు లేఖ

Achchennaidu : ఏపీలో హెల్త్ ఎమెర్జెన్సీ.. సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు లేఖ
X

ఆంధ్రప్రదేశ్‌లో సురక్షిత తాగునీరు అందక ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమెర్జెన్సీ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉందని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటిని సరఫరాల చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శలు గుప్పించారు.

సురక్షిత నీరు అందక ఏపీలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. గుంటూరులో కలుషిత నీరు తాగి డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అచ్చెన్న ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్‌కు సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. కనీసం ఇంకో నెల రోజులైనా ప్రజల గురించి ఆలోచించాలని లేఖలో తెలిపారు. వెంటనే ప్రజలకు సురక్షితమైన నీటిని అందించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated : 2 March 2024 11:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top