Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ చేరుకున్న పవన్..వారాహి విజయ యాత్రకు సర్వం సిద్ధం

విశాఖ చేరుకున్న పవన్..వారాహి విజయ యాత్రకు సర్వం సిద్ధం

విశాఖ చేరుకున్న పవన్..వారాహి విజయ యాత్రకు సర్వం సిద్ధం
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో పవన్ దాదాపు 10 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక ఇవాళ్టి నుంచి పవన్ వారాహి మూడో దశ విజయ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం జగదాంబ జంక్షన్‎లో పవన్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సభలో పవన్ ప్రసంగం ఎలా ఉండబోతోందన్నది ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది. ఇప్పటికే 2వ దశ వారాహి విజయ యాత్రలో ఎన్నో కీలకమైన ప్రసంగాలతో పవన్ రాజకీయాలను వేడెక్కించారు. 3వ దశలో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతోందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఇదే సభలో స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్ట్ కార్మికుల పోరాటాలకు మద్దతు తెలపబోతున్నారు. ఆ తరువాత జనవాణి కార్యక్రమం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తారు. వారాహి విజయ యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను సైతం నియమించారు పవన్.















Updated : 10 Aug 2023 8:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top