Home > ఆంధ్రప్రదేశ్ > కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ?

కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ?

కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ?
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే జనసేన, టీడీపీ, బీజేపీలు ఒక్కటై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంచలన సృష్టించిన కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఎలక్షన్స్ లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల కోడి కత్తి శ్రీను జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరాడు. అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నాడు.

ఈ సందర్భంగా శ్రీనుకు అంబేద్కర్ విగ్రహం ఇచ్చి జడ శ్రావణ్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, అసెంబ్లీ ఎలక్షన్స్ లో అమలాపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో శ్రీను ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రువర్‌గా మారిన దస్తగిరి కూడా జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరారు. ఆయన పులివెందుల నుంచి సీఎం జగన్ పై పోటీ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

2018 అక్టోబర్‌లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శ్రీనివాస్‌ కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న శ్రీను.. ఇటీవల కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యాడు.

Updated : 12 March 2024 4:43 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top