Home > ఆంధ్రప్రదేశ్ > TTD: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు పెంపు, ఇళ్ల స్థలాలు.. మరెన్నో

TTD: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు పెంపు, ఇళ్ల స్థలాలు.. మరెన్నో

TTD: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త..  జీతాలు పెంపు, ఇళ్ల స్థలాలు.. మరెన్నో
X

తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీటీడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం 85 కోట్లతో మరో 350 ఎకరాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. శానిటేషన్ ఉద్యోగులు, వర్క్ కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాలు పెంచనున్నట్లు తెలిపారు. లడ్డు పోటు కార్మికులకు వేతనాలు 28 వేల నుండి 38 వేలుకు(10 వేల పెంపు)పెంచారు. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఇవే కాకుండా...

టీటీడీ సత్రాల స్థానంలో రూ.418 కోట్లతో అతిథి భవనాల నిర్మాణాలకు టెండర్లు

అలిపిరి దగ్గర రూ.7.31 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన

ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించేందుకు నిర్ణయం

కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయం

తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం

తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయం

జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం

చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల కేటాయింపు

శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయం

శ్రీవారి ఆలయ పెద్ద జీయార్‌, చిన్న జీయార్‌ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంపు

పెద్ద జీయర్‌ మఠానికి రెండు కోట్లు నుండి రెండు కోట్ల 60 లక్షలకు పెంపు

చిన్న జీయర్‌ మఠానికి ఒక కోటి 70లక్షల నుండి 2 కోట్ల 10 లక్షలకు పెంపు.

Updated : 26 Dec 2023 8:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top