Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో భారీగా తహసీల్దార్ల బదిలీలు

ఏపీలో భారీగా తహసీల్దార్ల బదిలీలు

ఏపీలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
X

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తహసీల్ధార్లను బదిలీ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం భారీ సంఖ్యలో ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 లలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జోన్ 1లో 137 మంది, జోన్ 2 -170 మంది, జోన్ 3లో 154 మంది, జోన్ 4 లో 249 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఈసీ సూచనల మేరకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం మరోసారి పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. మరికొంత మంది ఐపీఎస్ అధికారుల పోస్టింగ్​లో మార్పులు చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఇచ్చిన పోస్టింగ్ లు, బదిలీల్లో మార్పు చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శాంతిభద్రతల అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీకి హోంగార్డ్ ఏడీజీగానూ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ రిక్రూట్​మెంట్​ బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూరిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ లో శాంతిభద్రతల డీసీపీ గా కృష్ణకాంత్ ను నియమించారు. సీఐడీ ఎస్పీగా గంగాధర్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంటుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గా వి. రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంటుగా అమిత్ బర్దార్ ను నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి ఆనంద రెడ్డి బదిలీ చేస్తూ ఈ మార్పులు చేశారు.

Updated : 31 Jan 2024 4:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top