Home > ఆంధ్రప్రదేశ్ > రూ.4,831 కోట్ల బకాయిలు మార్చిలోనే చెల్లిస్తాం: మంత్రి బొత్స

రూ.4,831 కోట్ల బకాయిలు మార్చిలోనే చెల్లిస్తాం: మంత్రి బొత్స

రూ.4,831 కోట్ల బకాయిలు మార్చిలోనే చెల్లిస్తాం: మంత్రి బొత్స
X

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నేడు విజయవాడలో సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘ నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిస్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగులకు కూడా ఆ మాటే చెప్పామని అన్నారు. పూర్తిస్థాయిలో పీఆర్సీనే ఇస్తామని అంటున్నప్పుడు ఇక మధ్యంతర భృతి ఎందుకని బొత్స ప్రశ్నించారు. ఒక వేళ పీఆర్సీ ఆలస్యమైనప్పుడే మధ్యంతర భృతిని ఇస్తారని అన్నారు.

మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానమే కాదన్నారు. మార్చిలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలన్నారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చల తర్వాత ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాకు వివరాలు తెలిపారు. రూ.4,831 కోట్ల పెండింగ్ బకాయిలను మార్చి చివరి నాటికి మంత్రి బొత్స సత్యనారాయణ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

పీఆర్సీ చెల్లింపులు కూడా రూ.14,102 కోట్లను చెల్లించేందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. అలాగే పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాల్సిన పీఆర్సీ పాత బకాయిలను ఎవరెవరికి ఎంత చెల్లించాలో లెక్క చూసుకుని సమావేశంలో ప్రకటిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జులై నెలలోపే పీఆర్సీని సెటిల్ చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.


Updated : 23 Feb 2024 2:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top