Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు దంపతులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు దంపతులు

చాలా సంతోషంగా ఉంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు దంపతులు
X

తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్‌ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు మంత్రి హరీశ్ రావును పట్టు వస్త్రంతో సత్కరించారు.

దర్శనం అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి హరీష్‌రావుతోపాటు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి (MP Parthasathi Reddy), రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శ్రీనివాసరాజులు (Srinivasaraju), జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ హన్సరాజ్‌ గంగారాం (Hansraj Gangaram) కూడా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Updated : 7 Aug 2023 8:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top