Home > ఆంధ్రప్రదేశ్ > కేసీఆర్కు చంద్రబాబు పరామర్శ

కేసీఆర్కు చంద్రబాబు పరామర్శ

కేసీఆర్కు చంద్రబాబు పరామర్శ
X

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య వివరాలను ఆయన తనయుడు కేటీఆర్, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ కు విజయవంతంగా తుంటి ఆపరేషన్ జరిగిందని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 6 వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. కాగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నటుడు ప్రకాశ్ రాజ్ దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, మాజీ మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్ యశోదా ఆసుపత్రికి వచ్చి తదితరులు కేసీఆర్ ను పరామర్శించారు. ఇక నిన్న (10.12.2023) యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. సీఎంతో పాటు మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ కేసీఆర్ ను పరామర్శించారు. ఇక ఈ నెల 9న కేసీఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.




Updated : 11 Dec 2023 12:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top