Home > ఆంధ్రప్రదేశ్ > Alert:10వ తరగతి విద్యార్థులకు అలర్ట్..పబ్లిక్ ఎగ్జామ్స్‏లో కొత్త విధానం

Alert:10వ తరగతి విద్యార్థులకు అలర్ట్..పబ్లిక్ ఎగ్జామ్స్‏లో కొత్త విధానం

Alert:10వ తరగతి విద్యార్థులకు అలర్ట్..పబ్లిక్ ఎగ్జామ్స్‏లో కొత్త విధానం
X

గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు ఉండగా..ఈ ఏడు మాత్రం ఏడు పేపర్ల విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. 50 మార్కులకు ఫిజిక్స్ , కెమిస్ట్రీని కలిపి ఒక పేపర్‌గా , మరో 50 మార్కులకు బయాలజీ పేపర్‌ను క్వశ్చన్ పేపర్‎గా ఇవ్వనున్నారు. ఈ రెండు పేపర్లలోనూ 17 ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. టీచర్ యూనియన్ లీడర్లతో విజయవాడలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన సమావేశంలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో ఈ విధానం తీసుకువస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రెండు రోజులు జరిగే జనరల్ స్టడీస్ పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయిస్తారు. మిగతా 5 సబ్జెక్టులు100 మార్కులకు ఒక్కొక్క పేపర్ ఉంటుంది.

పదో తరగతి పరీక్షల్లో ఇప్పటి వరకు అమలవుతున్న కాంపొజిట్‌ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు లేదా సంస్కృతం, ఉర్దూ లేదా హిందీ, ఉర్దూ లేదా అరబిక్‌, ఉర్దూ లేదా పార్శీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇకపై ఫస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే 100 మార్కులకు ఉంటుంది.

తెలుగు క్వశ్చన్ పేపర్‎లోనూ పలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రశ్నాపత్రాల్లో వచ్చే ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నలను తీసేశారు. వీటి స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై నాలుగు క్వశ్చన్స్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. ఒక్కోదానికి రెండు మార్కుల చొప్పున 8 మార్కులు కేటాయించారు. రెండో క్వశ్చన్‏గా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండేవి. ఇప్పుడు పద్యాన్ని చదివి,4 క్వశ్చన్స్‎కు నాలుగు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇందులోనూ ఒక్కో క్శశ్చన్‎కు రెండు చొప్పున 8 మార్కులు కేటాయించారు.

విన్నవించింది. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated : 9 Aug 2023 2:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top