Home > ఆంధ్రప్రదేశ్ > Pawan Kalyan : మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తోన్న జనసేనాని

Pawan Kalyan : మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తోన్న జనసేనాని

Pawan Kalyan : మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తోన్న జనసేనాని
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా పొత్తుతో ఒక్కటైన టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీని ఎదుర్కొనేందుకు బలమైన నేతలను బరిలోకి దింపాలని జనసేన, టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ, జనసేన పార్టీ నేతలకు ఓ క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. బుధవారం భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ నేతలను సైతం కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

2019 ఎన్నికల్లో కూడా భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ 2వ స్థానంలో నిలిచారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత పవన్ పొత్తులపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు పవన్ భీమవరం నుంచి పోటీ చేయడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జనసేన తన సత్తా చూపిస్తుందని, విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated : 21 Feb 2024 7:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top