Home > ఆంధ్రప్రదేశ్ > భోరున ఏడ్చిన పవన్.. న్యాయం చేస్తానని హామీ

భోరున ఏడ్చిన పవన్.. న్యాయం చేస్తానని హామీ

భోరున ఏడ్చిన పవన్.. న్యాయం చేస్తానని హామీ
X

విశాఖలో ఇటీవల వెంకట్ అనే గ్రామ వలంటీర్ కోటగిరి వరలక్ష్మి (72) అనే వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. వరలక్ష్మి ఇంట్లోని బంగారం, డబ్బుపై ఆశపడ్డ వెంకట్ ఎవరూ లేని టైం చూసి ఆవిడను అంతమొందించాడు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న ఆవిడ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. పవన్ ఒక్కసారిగా భోరున విలపించారు. వారితో మాట్లాడుతున్నంత సేపు భావోద్వేగంలోనే ఉండిపోయారు. ఓ నేత తమ తల్లికోసం కన్నీరు పెట్టుకోవడం చూసి వరలక్ష్మి కొడుకులు చలించిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన వరలక్ష్మి కొడుకులు ‘పవన్ కళ్యాణ్ మా తల్లిని ఆయన తల్లిగా భావిస్తున్నార’న్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వంతో పోరాడతానని చెప్పినట్లు వాళ్లు వెల్లడించారు.








Updated : 12 Aug 2023 1:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top