Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీకి చల్లటి కబురు.. మరో రెండు రోజుల్లో..

ఏపీకి చల్లటి కబురు.. మరో రెండు రోజుల్లో..

ఏపీకి చల్లటి కబురు.. మరో రెండు రోజుల్లో..
X

కేరళను తాకిన రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పవనాల గమనంలో వేగం పరగడంతో రెండు రోజుల్లోనే రాయసీమ, కోస్తాంధ్ర జిల్లాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మామూలుగా అయితే కేరళ నుంచి రుతుపవనాలు రావడానికి నాలుగు రోజులు పడుతుంది. ప్రస్తుతం వాటి గమనంలో వేగం ఉన్నందున.. ఒకరోజు ముందుగానే ఏపీని తాకే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో ఈశాన్య రాష్ట్రాలైన.. పశ్చిమబెంగాల్, ఒడిశా, సిక్కిం ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన బివర్ జోయ్ తుఫాను కారణంగా.. రుతుపవనాలు శ్రీలంక కింది భాగం నుంచి విస్తరించాయి. 3 రోజుల్లోనే పైనున్న తమిళనాడు, కర్నాటకకు విస్తరించాయి. అయితే, ఉష్ణోగ్రతలో మార్పు మాత్రం రుతుపవనాలు పూర్తిగా విస్తరించాకే జరుగుతుందని వాతావరణ శాఖ సూచించింది.

Updated : 10 Jun 2023 2:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top