Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila : షర్మిలతో భేటీ అయిన వివేకానందరెడ్డి కూతురు

YS Sharmila : షర్మిలతో భేటీ అయిన వివేకానందరెడ్డి కూతురు

YS Sharmila : షర్మిలతో భేటీ అయిన వివేకానందరెడ్డి కూతురు
X

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కలిశారు. ఇడుపులపాయలో ఆమె షర్మిలతో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు రెండు గంటల సేపు వీరు చర్చలు జరిపారు. షర్మిల పీసీసీ బాధ్యతలను చేపట్టిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే తొలిసారి. వివేకా హత్య కేసులో సునీతకు షర్మిల మద్దతుగా నిలిచారు. సమావేశానంతరం వారిద్దరూ వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కడప జిల్లాలో ఏర్పాటు చేసే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సునీత కూడా హాజరుకానున్నారు. అయితే పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల, కడప ఎంపీ స్థానం నుంచి సునీత పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.




Updated : 29 Jan 2024 6:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top