Home > ఆంధ్రప్రదేశ్ > సిట్ అధికారికి చంద్రబాబు లేఖ..

సిట్ అధికారికి చంద్రబాబు లేఖ..

సిట్ అధికారికి చంద్రబాబు లేఖ..
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రమంతటా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం సిట్ అధికారులు బాబును విచారిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసేందుకు ఆయన తరఫు లాయర్లు ప్రయత్నించినా, సిట్ కార్యాలయంలోకి వారిని అనుమతించడం లేదు. దీంతో సిట్ అధికారుల తీరుపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ రూల్స్ మేరకు పర్మీషన్ ఇవ్వడంలేదని ప్రశ్నించారు.

సిట్ అధికారుల తీరుపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్ ఆఫీసులోకి గవర్నమెంటు తరఫు లాయర్లను అనుమతించి, తమను పర్మీషన్ ఇవ్వకపోవడంపై వారు ఫైర్ అవుతున్నారు. ఏ రూల్స్ ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ అధికారులు రూల్స్‎కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‎కు ఓ లేఖ రాశారు. తన తరఫు న్యాయవాదులను సిట్ కార్యాలయంలోనికి అనుమతించాలని లెటర్‎లో కోరారు. దమ్మాలపాటి శ్రీనివాస్‌, పోసాని వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మీనారాయణ, శరత్‌ చంద్రను తనను కలిసేందుకు పర్మీషన్ ఇవ్వాలని లేఖలో తెలిపారు.

విజయవాడ ఏసీబీ కోర్టులో తమ అధినేతను హాజరుపరుస్తామని సీఐడీ ఆఫీసర్లు తెలిపినప్పటికీ..ఆయన్ని సిట్ ఆఫీస్‎లోనే ఉంచడంతో టీడీపీ నేతలు ఫైర్ అవున్నారు. దీంతో మరి కాసేపట్లో వారు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవబోతున్నారు. గవర్నర్ కూడా వారికి అపాయింటుమెంట్ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు తదితరులు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నారు.




Updated : 9 Sep 2023 3:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top