Home > ఆంధ్రప్రదేశ్ > నేడు మంగళగిరిలో టీడీపీ, జనసేన జయహో బీసీ సభ..బీసీ డిక్లరేషన్ విడుదల

నేడు మంగళగిరిలో టీడీపీ, జనసేన జయహో బీసీ సభ..బీసీ డిక్లరేషన్ విడుదల

నేడు మంగళగిరిలో టీడీపీ, జనసేన జయహో బీసీ సభ..బీసీ డిక్లరేషన్ విడుదల
X

నేడు గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా తెలుగుదేశం-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జయహో బీసీ’ సభలో వారు పాల్గొననున్నారు. అంతేగాక భారీ బహిరంగ సభలో ఉమ్మడి ‘బీసీ డిక్లరేషన్’ను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలిరానున్నారు. ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు.

అయితే ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అక్కడి సభ ఏర్పాట్లను పరిశీలించారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను డిక్లరేషన్ ను ఇరువురు అధినేతలు ప్రకటిస్తారని చెప్పారు. సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సాధికారిక కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులు, ప్రజల వినతులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని డిక్లరేషన్ సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జయహో బీసీ సభను విజయవంతం చేయాలని జనసేన, టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Updated : 5 March 2024 4:42 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top