Home > ఆంధ్రప్రదేశ్ > భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

భక్తులకు గుడ్ న్యూస్..  తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
X

తిరుమల శ్రీవారి మే నెల కోటాకు సంబంధించి టికెట్లను ఇవాళ అన్‌లైన్‌లో టీడీపీ విడుదల చేసింది. మే నెలక సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల రిలీజ్ చేసింది. అలాగే ఈ నెల 27న శ్రీవారి సేవ, వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 27న శ్రీవారి సేవ, పరకామణి టికెట్లు విడుదల కానున్నాయి. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. మరోవైపు తిరుపతికి చెందిన శ్రీ మ‌ణి రెండు పరదాలు, రెండు‌ కురాళాలు వితరణంగా ఆలయానికి విరాళంగా అందించారు

Updated : 24 Feb 2024 8:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top