Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila: రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి...

YS Sharmila: రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి...

YS Sharmila: రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి...
X

ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఒక్కసారి కూడా ఆంధ్ర గురించి ఆలోచించలేదన్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలకు.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. అసెంబ్లీ సమావేశంలో ఈసారైనా ప్రతిపక్షమైనా, పాలకపక్షమైనా ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించవలసిన పరిస్థితి ఉందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు, ముఖ్యమంత్రి జగన్ కి లేఖల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క హక్కుల తీర్మానం చేయాలని సూచించామన్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 5 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ఒక్కరు రాష్ట్రం గురించి ఆలోచించలేదన్నారు. వాళ్ళ స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. ఈసారైనా సరే అసెంబ్లీ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల తీర్మానాన్ని ప్రజల కోసం బిల్లు పాస్ చేయాలన్నారు. ఆంధ్ర కి ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో బిజెపి పార్టీ ఎందుకు ద్రోహం చేసిందో వీటన్నంటి గురించి అసెంబ్లీలో చర్చలు జరిగి, తీర్మానాన్ని ప్రెసిడెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

"ఒకరేమో కుర్చీ ఎలా కాపాడుకోవాలని, ఒకరేమో కుర్చీ ఎలా సంపాదించాలి అనే పనిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. బీజేపీ పొత్తు పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఇంటికి పంపించాలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ సీసీ అధ్యక్షురాలిని అయిన నేను రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి. కానీ అవేవీ పెట్టకుండా మహిళా అని చూడకుండా, కనీసం మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదంటే మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ప్రజాస్వామ్యం అని అసలు మీకు గుర్తుందా.?" అని షర్మిల ప్రశ్నించారు. "మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మిగతా వారికి, మిగతా నాయకులకు ప్రజలకు భరోసా కల్పించవలసిన పరిస్థితి ప్రతిపక్షాలకు రక్షణ కల్పించవలసిన పరిస్థితి లేదా....అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.? " అంటూ నిలదీశారు.

Updated : 7 Feb 2024 11:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top