Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila: లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్‌టీపీ కీలక సమావేశం.. కాంగ్రెస్‌లో విలీనంపై చర్చ

YS Sharmila: లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్‌టీపీ కీలక సమావేశం.. కాంగ్రెస్‌లో విలీనంపై చర్చ

YS Sharmila: లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్‌టీపీ కీలక సమావేశం.. కాంగ్రెస్‌లో విలీనంపై చర్చ
X

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని.. ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు దక్కించుకోనున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె చేరికతోనే ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక, తెలంగాణల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే ఊపును ఏపీ రాజకీయాల్లోనూ తీసుకుని రావాలని భావిస్తోంది. ఏపీలోనూ ఆ స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సత్తా ఒక్క వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉందని నమ్ముతోంది కాంగ్రెస్ అధిష్ఠానం. అందుకే కాంగ్రెస్ షర్మిలకు రెడ్ కార్పెట్ తో గ్రాండ్ వెల‌్‌కమ్ చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని YSRTP ఆఫీస్‌లో పార్టీ ముఖ్య సభ్యులు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినప్పటికీ.. కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే తీర్మానంపై కూలంకషంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక లేదా విలీనానికి కొన్ని షరతులను పెట్టాలని వైఎస్ఆర్టీపీ భావిస్తోంది. గత ఏడాది చివర్లోనే వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వై.ఎస్. షర్మిల చర్చించారు. అయితే తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు వై.ఎస్. షర్మిల సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ నిలిచిపోయింది. అయితే మరోసారి వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ మరోసారి తెరమీదికి వచ్చింది. ఇవాళ హైద్రాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయమై ఆ పార్టీ నేతలతో వై.ఎస్. షర్మిల చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి వై.ఎస్. షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉంది.




Updated : 2 Jan 2024 5:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top