Home > కెరీర్ > టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారంలో టెట్ నోటిఫికేషన్..!

టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారంలో టెట్ నోటిఫికేషన్..!

టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారంలో టెట్ నోటిఫికేషన్..!
X

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. టెట్ ను సెప్టెంబర్ లో నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ నిర్ణయించింది. వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ మూడో వారంలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వాహణకు కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వాహణపై ప్రతిపాదనలు రూపొందించి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆ ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదం తెలపడంతో టెట్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్టంలో 1.5 లక్షల డీఎడ్‌, 4.5 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులున్నారని అధికారుల అంచనా. 2017 టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీ చేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండేది. అయితే రెండేండ్ల క్రితం దాని కాలపరిమితిని జీవితకాలం పొడిగించారు. గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్‌ అభ్యర్థులు మాత్రమే అర్హులుకాగా.. ఇప్పుడు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం ఇచ్చారు.

Updated : 29 July 2023 2:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top