Home > కెరీర్ > TSPSC : గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6,7న ఎగ్జామ్..

TSPSC : గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6,7న ఎగ్జామ్..

TSPSC :  గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6,7న ఎగ్జామ్..
X

గ్రూప్ 2 ఎగ్జామ్పై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. నాంపల్లిలోని కార్యాలయంలో కమిషన్ సమావేశమై పరీక్ష నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించింది. ఈ క్రమంలో అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలంటూ కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు గుర్తించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని.. అందులో మార్పులు, చేర్పులుంటే తమకు తెలియజేయాలని కలెక్టర్లకు సూచించారు.

చీఫ్ సూపరింటెండెంట్ గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని.. అక్కడే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తెరిచి పంపిణీ చేయాలన్నారు. ఓఎంఆర్ షీట్ల లెక్కింపు, ప్యాక్ చేసి సీలు వేయడం వంటివి అక్కడే చేయాలని వివరించారు. ఈ నెల 7లోపు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి తమకు నివేదిక అందించాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది. కాగా గ్రూప్-2 పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకునేలోపే ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్‌పీఎస్సీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.


Updated : 5 Dec 2023 5:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top