Home > సినిమా > ఇదేందయ్యా ఇది..శ్మశానంలో టీజర్ లాంచ్ ఈవెంట్

ఇదేందయ్యా ఇది..శ్మశానంలో టీజర్ లాంచ్ ఈవెంట్

ఇదేందయ్యా ఇది..శ్మశానంలో టీజర్ లాంచ్ ఈవెంట్
X

టాలీవుడ్ హీరోయిన్ అంజలి ముఖ్యపాత్రలో నటించిన చిత్రం గీతాంజలి. ఈ మూవీ హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఎంతగానో మెప్పించింది. ఆ మూవీకి సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి శివ తూర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ పతాకాలపై కోన వెంకట్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను మేకర్స్ మొదలుపెట్టారు. అంజలికి ఈ మూవీ 50వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ అప్‌డేట్ తీసుకొచ్చారు. ఈ మూవీ టీజర్‌ను వినూత్నంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హర్రర్ కథాంశం కావడంతో టీజర్‌ను నేడు బేగంపేట శ్మశానంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. శ్మశానంలో ఓ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. గతంలో విడుదలైన గీతాంజలి మూవీ ఎక్కడైతే ముగిసిపోయిందో అక్కడే ఈ మూవీ సీక్వెల్ కథ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.

'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ మొత్తం హాస్యంతో ఆకట్టుకుంటుందని, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు కోన వెంకట్ తెలిపారు. ఈ మూవీలో అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత అంజలి మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే ఆమెకు 50వ చిత్రం కావడంతో ప్రమోషన్స్ వర్క్ గట్టిగా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.


Updated : 24 Feb 2024 9:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top