Home > సినిమా > లావణ్యకు సరదగా చెప్తే అన్నంత పని చేసింది :అల్లు అరవింద్

లావణ్యకు సరదగా చెప్తే అన్నంత పని చేసింది :అల్లు అరవింద్

లావణ్యకు సరదగా చెప్తే అన్నంత పని చేసింది :అల్లు అరవింద్
X

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిలు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ ఏడాదిలోనే వారి వివాహం జరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లు పాటు సీక్రెట్‎గా ప్రేమ వ్యవహారం నడిపిన ఈ జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం అనంతరం వారి ఫోటోలతో పాటు అల్లు అరవింద్‎కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది.

‘చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. "ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని అల్లు అరవింద్ అన్నారు. అతను అన్న విధంగానే మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌‌తో లావణ్య పెళ్లిపీటలెక్కనుంది. దీంతో అల్లు అరవింద్ చెప్పిందే నిజమైందని అని అందరూ ఆ వీడియోను షేర్ చేశారు. అల్లు అర్జున్ సైతం ఈ వీడియోని షేర్‌ చేసి మరీ ‘మా నాన్న విజనరీ, ఆయన చెప్పిందే జరిగింది’ అని ట్వీట్‌ చేశాడు.

మరోసారి ఈ వ్యాఖ్యలపై ‘బేబీ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌లో అల్లు అరవింద్‌ స్పందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయనకు లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి చేసిన మాటలను యాంకర్ గుర్తుచేయగా తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘ఏదో సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకొని మా వాడినే పెళ్లి చేసుకోబోతుంది’ అని చెప్పి అందరినీ నవ్వించారు.

ఇక బేబి సినిమా విషయాని కొస్తే...సాయి రాజేష్ ఈ చిత్ర దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించారు. జులై 14న బేబి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Updated : 13 July 2023 2:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top