Home > సినిమా > Bandla Ganesh : రోజా పులుసు పాప.. బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్

Bandla Ganesh : రోజా పులుసు పాప.. బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్

Bandla Ganesh : రోజా పులుసు పాప.. బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్
X

ఏపీ మంత్రి రోజా డైమండ్ రాణి అని కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ఎమ్మెల్యే సీటు వస్తుందో రాదో డౌటు అని.. రేవంత్‌రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని రోజా ఎవరి దగ్గర పని చేస్తున్నారో ఆయన జాక్‌పాట్‌ సీఎం అని ఆయన అన్నారు. నువ్వు పులుసు వండిపెట్టావో కాబట్టి పులుసు పాపవి. రేపో మాపో మాజీ అవుతావు. పగలు జబర్థస్తు ఘాటింగ్‌లు, రాత్రిళ్లు మాజీలంతా తాజాగా కేజీలు తెచ్చుకుని పులుసు వండి పెట్టు కోండి నువ్వు ఐటెం రాణివి అని బండ్ల గణేశ్ ఫైరయ్యారు.రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని.. రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని చెప్పారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని.. పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై మాదిరి ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో ఏదో సాధిస్తామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ కు మరిన్న కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కేటీఆర్ చెప్పాలని అన్నారు. ఫోన్ రింగ్ అయినా కేటీఆర్ భయపడిపోతున్నారని చెప్పారు. కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై మాట్లాడుతూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్, జగన్ ఇద్దరూ రోజా వండిన చేపల పులుసు తిన్నారని.. ఆ తర్వాత తెలంగాణ వాటా నీళ్లను రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ఇచ్చారని ఆయన విమర్శించారు.




Updated : 27 Feb 2024 8:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top