Home > సినిమా > కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘కలియుగం పట్టణంలో’..గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్

కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘కలియుగం పట్టణంలో’..గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్

కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘కలియుగం పట్టణంలో’..గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్
X

విశ్వ కార్తికేయ, ఆయూసి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ 'కలియుగం పట్టణంలో'. ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు ఈ మూవీని నిర్మించారు. మార్చి 29న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో సుమన్, నిర్మాత ఏఎం.రత్నం చీఫ్ గెస్ట్‌లుగా వచ్చారు.

ఈవెంట్‌లో సుమన్ మాట్లాడుతూ..ఈ మూవీ విజయం సాధించాలని దీవించారు. నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల్లో ఉన్న ప్యాషన్‌కు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించానని అన్నారు. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబోస్ సాహిత్యం అద్భుతంగా ఉందని, అన్నీ సీన్స్ చక్కగా వచ్చాయన్నారు. మూవీని సపోర్ట్ చేయాలని కోరారు. నిర్మాత ఏఎం.రత్నం మాట్లాడుతూ..ఈ మూవీ టైటిల్ చాలా కొత్తగా ఉందన్నారు.

చంద్రబోస్ రాసిన కలియుగం కలుషితం అనే పాట అద్భుతంగా ఉందన్నారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ..దేవీ ప్రసాద్ వంటి సీనియర్లు డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. విశ్వ కార్తికేయ అద్భుతంగా యాక్ట్ చేశాడన్నారు. కెరీర్ లోనే ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు హీరోయిన్ ఆయుషి పటేల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.



Updated : 27 March 2024 11:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top