Home > సినిమా > Shahrukh Khan : అంబానీ ఈవెంట్‌లో ‘నాటునాటు’ సాంగ్‌కు స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్స్

Shahrukh Khan : అంబానీ ఈవెంట్‌లో ‘నాటునాటు’ సాంగ్‌కు స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్స్

Shahrukh Khan  : అంబానీ ఈవెంట్‌లో ‘నాటునాటు’ సాంగ్‌కు స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్స్
X

ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబాని- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై ఆర్ఆర్‌ఆర్ మూవీలోని నాటు నాటు హిందీ వెర్షన్ పాటకు డాన్స్ చేశారు. చాలా కాలం తర్వాత ముగ్గురు అగ్ర హీరోలు ఒకే స్టేజ్‌పై కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వేడుకలకు ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రెటీస్ హజరయ్యారు. ఫిబ్రవరి 28 నుంచే ప్రీ వెడ్డిండ్ వేడుకలు స్టార్ట్ అవ్వగా.. మార్చి 1 నుంచి ప్రముఖుల తాకిడి పెరిగింది. ఈరోజుతో ఈ వేడుకులు ముగియబోతున్నాయి. కాగా పాప్ సింగర్ రిహాన్న తన ప్రదర్శనతో ఊర్రూతలూగించగా.. ఆమెకు కోట్లలో రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తోంది. రిహన్నా ఫస్ట్ టైమ్ ఇండియాలో ప్రదర్శన ఇవ్వడం విశేషం. అంతే కాదు అంబాని సంగీత్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా డాన్స్ ల‏తో సందడి చేశారు.





ఈ వేడుకలలో మరోసారి ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ మారుమోగింది.ఈ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌కు రామ్‌చరణ్‌-ఉపాసన హాజరయ్యారు. వీళ్లిద్దరూ ధోనీ దంపతులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లందరూ కలిసి ఈవెంట్‌కు వెళ్తున్న వీడియోను సినీ, క్రీడాభిమానులు షేర్‌ చేస్తున్నారు. సినీ తారలు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, షారుక్‌ఖాన్‌ కుటుంబం, అర్జున్‌ కపూర్‌, ఆలియాభట్‌-రణబీర్‌ కపూర్‌ కుటుంబం, దర్శకుడు అట్లీ తదితరులు ఈ వేడుకల్లో పాల్గోన్నారు.సుమారు 2500 రకాల వంటకాలతో ఆశ్చర్యపరచునున్నారట. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 25 మంది చెఫ్‌ల బృందాన్ని జామ్‌నగర్‌కు రప్పించారు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాలతోపాటు ఇండోర్ ఫుడ్‌కు ప్రాధాన్యమివ్వనున్నారు. అయితే వివాహ వేడుకలు ప్రారంభం నుంచి ముగిసేవరకు మొత్తం రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇంత ఖర్చు అయితే.. దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిగా ఇది నిలిచిపోనుంది.



Updated : 3 March 2024 6:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top