Home > సినిమా > దాసరి కొండప్పను సన్మానించిన దిల్ రాజు

దాసరి కొండప్పను సన్మానించిన దిల్ రాజు

దాసరి కొండప్పను సన్మానించిన దిల్ రాజు
X

ఒకప్పుడు పద్మశ్రీ అవార్డ్ అంటే బాగా కలిగినోళ్లకు మాత్రమే ఇస్తారు అనుకునేవారు. సాధారణ జనమైతే అదేదో బలిసినోళ్ల వ్యవహారం అనుకునేవారు. బట్ కొన్నాళ్లుగా సామాన్యులకు సైతం ఈ అత్యున్నద పురస్కారం లభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన అంతరించిపోతోన్న కళలను కాపాడుతూ వస్తోన్న వారికి పద్మశ్రీ రావడం ఈ ప్రాంత గొప్పదనాన్ని చాటుతూ వస్తోంది. ఇంతకు ముందు పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు పద్మశ్రీ వచ్చింది. తాజాగా మరో ప్రాచీన వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఇదే సందర్భంలో చిరంజీవికి పద్మ విభూషణ్ కూడా వచ్చింది. అయినా తనతో పాటు పద్మశ్రీకి ఎంపికైన వారందరినీ ఇంటికి పిలిచిన సన్మానించాడు చిరంజీవి. తాజాగా తెలంగాణ బిడ్డ అయిన దిల్ రాజు సైతం దాసరి కొండప్పను సత్కరించి లక్ష రూపాయల కానుక కూడా ఇచ్చాడు.

విశేషం ఏంటంటే.. కొండప్పను ప్రభుత్వం గుర్తించడానికి ముందే దిల్ రాజు గుర్తించాడు. తను నిర్మించిన బలగం సినిమాలో ఓ సన్నివేశంలో ఆయనను నటింపచేశారు. అఫ్ కోర్స్ ఈ క్రెడిట్ ఎక్కువగా దర్శకుడు వేణు ఎల్దండికే చెందినా దాన్ని అంగీకరించిన దిల్ రాజు మరవలేం కదా. ఇక తన సినిమాలో చిన్న పాత్రలో నటించిన కొండప్పను పిలిపించి మరోసారి ఆయన వాయిద్య ప్రతిభను చూసి మెచ్చుకుని లక్ష రూపాయల చెక్ అందించాడు దిల్ రాజు. ఈ లక్ష రూపాయలను బంధువులెవరూ తీసుకోకుండా ఆయనకు మాత్రమే ఖర్చు పెట్టాలని కూడా సూచించాడు. మొత్తంగా దిల్ రాజు చేసిన పనికి తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Updated : 3 Feb 2024 10:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top