Home > సినిమా > తెలుగు రాష్ట్రాలలో రెచ్చిపోతున్న నకిలీ నక్సలైట్లు ..

తెలుగు రాష్ట్రాలలో రెచ్చిపోతున్న నకిలీ నక్సలైట్లు ..

తెలుగు రాష్ట్రాలలో రెచ్చిపోతున్న నకిలీ నక్సలైట్లు ..
X

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నక్సలైట్లు రెచ్చిపోతున్నారు. బాగా డబ్బున్నవాళ్లు, వ్యాపారులను బెదిరించి భారీగా డబ్బులను వసూలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఇలాంటి తరహా ఘటనలు ఎక్కవుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏలూరు జిల్లా కైకలూరు‎కు చెందిన వ్యాపారి ప్రసాద్ రాజు‎కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము నక్సలైట్లమని..రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో పోలీసులను ప్రసాద్ రాజు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్లాన్ వేసి ముగ్గురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరోవైపు తెలంగాణలోని ములుగు జిల్లాలో ముగ్గురు నకిలీనక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి డమ్మీ తుపాకులతో ఇసుక వ్యాపారులను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా, సురేష్, రాజేశ్, మంగు అనే ముగ్గురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రెండు డమ్మీ తుపాకులు, రూ.10 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోవటంతో పోలీసులు నకిలీలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

Fake naxalites in Telugu states..

Fake naxalites,ap,telangana, phone calls, police arrest

Updated : 22 July 2023 12:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top