Home > సినిమా > ప్రసాద్ ఐమాక్స్‎లో ఇకపై నో రివ్యూస్..మేనేజ్మెంట్ కీలక నిర్ణయం

ప్రసాద్ ఐమాక్స్‎లో ఇకపై నో రివ్యూస్..మేనేజ్మెంట్ కీలక నిర్ణయం

ప్రసాద్ ఐమాక్స్‎లో ఇకపై నో రివ్యూస్..మేనేజ్మెంట్ కీలక నిర్ణయం
X

హైదరాబాద్‎లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై తమ థియేటర్ ప్రాంగణంలో సినిమా సమీక్షలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినోదం కోసం వచ్చే ప్రేక్షకులకు ఇబ్బంది కలుగకుండా, థియేటర్ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయితే చాలు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టిప్లెక్స్ సందడిగా మారుతుంది. అందులోనూ మొదటి షో చూసిన ప్రేక్షకుల రివ్యూస్‌కు ప్రసాద్ మల్టిప్లెక్స్ చాలా ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ హవా పెరిగిన నేపథ్యంలో సినిమా రిలీజ్ రోజున పబ్లిక్ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఛానల్స్ థియేటర్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర పోటీపడుతున్నాయి. దీంతో థియేటర్ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంటోంది. రీసెంట్‎గా జూన్ 16న ఆదిపురుష్ సినిమా రిలీజ్ సమయంలో ఓ యువకుడు చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు, దీంతో అతడిని ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ దగ్గరే చితకబాదారు. ఈ సంఘటనను సీరియస్‎గా తీసుకున్న యాజమాన్యం థియేటర్ వద్ద రివ్యూస్ బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు యూట్యూబర్లకు థియేటర్ ఆవరణలోకి ఎంట్రీ లేదని చెప్పేసింది.





Updated : 30 Jun 2023 7:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top