Home > సినిమా > నమ్రతతో కలిసి లండన్ చెక్కేసిన మహేశ్ బాబు..పిక్స్ వైరల్

నమ్రతతో కలిసి లండన్ చెక్కేసిన మహేశ్ బాబు..పిక్స్ వైరల్

నమ్రతతో కలిసి లండన్ చెక్కేసిన మహేశ్ బాబు..పిక్స్ వైరల్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి ఫారెన్ కంట్రీస్‎కు చెక్కేస్తుంటారు. హైదరాబాద్‌లో ఉండేకంటే ఎక్కువగా విదేశాల్లో గడిపేస్తుంటారు. లండన్, పారిస్ దుబాయ్ వంటి దేశాల్లోని ప్రముఖ నగరాల్లో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు మహేశ్ బాబు. తాజాగా "గుంటూరు కారం" చిత్రం కొత్త షెడ్యూల్ పూర్తి కావడంతో తన భార్య నమ్రత , పిల్లలతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ ఓ రెస్టారెంట్‎లో మహేష్ కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేశారు. లండన్ లో ప్రీ బర్డ్‎డే సెలబ్రేషన్స్ నిర్వహించారు! ఆ ఫోటోలను నమత్ర తన ఇన్‎స్టాగ్రామ్‎లో షేర్ చేశారు. ‘లండన్‌ కాలింగ్‌’ అనే క్యాప్షన్‌ తో ఫోటోలను పోస్ట్ చేయగా అవి క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో మహేశ్ టీ షర్ట్ వేసుకుని ఎంతో కూల్‎గా కనిపించారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‎లో రూపొందుతున్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ షూటింగ్‌తో మహేశ్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో షూటింగ్‎కు కాస్త బ్రేక ఇచ్చినట్లు ఈ పోస్ట్‌తో అర్ధమవుతోంది. త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల , మీనాక్షి చౌదరిలు కథానాయికలు. అతడు , ఖలేజా వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.







Updated : 25 July 2023 4:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top