Home > సినిమా > హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. ఫ్యాన్స్ టెన్షన్

హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. ఫ్యాన్స్ టెన్షన్

హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. ఫ్యాన్స్ టెన్షన్
X

టాలీవుడ్ యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టికి ప్రమాదం జరిగింది. అమెరికాలో ఉన్న నవీన్‌‌కు రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తుండగా స్కిడ్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నవీన్‌ చేతికి బలమైన గాయమైంది. చేయి ఫ్యాక్చర్ అయ్యిందని మరికొందరు చెబుతున్నారు. అమెరికాలోనే నవీన్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. నవీన్‌కి దాదాపు రెండు నెలలు వరకు విశ్రాంతి అవసరం అవుతుందని వైద్యులు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతోందని తెలిసి ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గతేడాది నవీన్‌ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' మూవీతో వచ్చాడు. ఆ మూవీలో నవీన్‌కు జతగా అనుష్క శెట్టి నటించింది. అంతకు ముందు 'జాతిరత్నాలు' మూవీతో నవీన్ పాపులర్ అయ్యాడు.

'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ సరికొత్త కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు నవీన్ చేతిలో రెండు సినిమాలున్నట్లు తెలుస్తోంది. ఒకటి సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్లోది కాగా, ఇంకోటి షైన్ సర్కీన్స్ బ్యానర్లోది అని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

Updated : 28 March 2024 11:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top