Home > సినిమా > వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకెళ్లలేం...వెంకటేశ్

వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకెళ్లలేం...వెంకటేశ్

వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకెళ్లలేం...వెంకటేశ్
X

టాలీవుడ్‎లో ఫ్యామిలీ హీరోగా క్రేజ్ ఉన్నవిక్టరీ వెంకటేష్ ఈ మధ్య తనను తాను తెరముందు కొత్తగా చూపిస్తున్నారు. రీసెంట్‎గా నెట్‎ఫ్లిక్స్ వేదికగా విడుదలైన రానానాయుడులో వెంకీ నటన చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. సిరీస్‎లోని చాలా సన్నివేశాల్లో అసభ్యపదజాలాన్ని వాడటం , శృతిమించిన సీన్స్ ఉండటంతో వెంకీకి కాస్త నెగెటివిటీ వచ్చిన విషయం వాస్తవమే. అయితే సిరీస్‎పై వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్‎పైన వెంకటేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తున్న అహింస సినిమా ప్రమోషన్‎లో మొదటిసారి సిరీస్‎పై వెంకటేశ్ మాట్లాడారు.

అహింస ప్రమోషన్ ఈవెంట్‏లో వెంకటేశ్ మాట్లాడుతూ.." కొన్ని సీన్స్ కారణంగా ఈ సిరీస్ కొందరిపై ప్రభావం చూపించిన మాట వాస్తవమే. నార్త్‎లో రానానాయుడు సిరీస్‌పై మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసింది. ఫస్ట్ సిరీస్ నచ్చలేదని.. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? అందుకే సెకెండ్ సిరీస్‎ను తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా తీస్తున్నాం. కచ్చితంగా రెండో సిరీస్‎కు ప్రేక్షకులు పెరుగుతారు. ది బెస్ట్ కంటెంట్‎తో మీ ముందుకు వస్తాం"అని వెంకటేశ్ తన స్పందనను తెలిపారు.

Updated : 31 May 2023 2:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top