Home > సినిమా > ఆ వార్తలన్నీ నిజమే.. ఇప్పుడు నా జీవితం పరిపూర్ణమైంది : ప్రభుదేవా

ఆ వార్తలన్నీ నిజమే.. ఇప్పుడు నా జీవితం పరిపూర్ణమైంది : ప్రభుదేవా

ఆ వార్తలన్నీ నిజమే.. ఇప్పుడు నా జీవితం పరిపూర్ణమైంది : ప్రభుదేవా
X

50 ఏళ్ల వయస్సులో ప్రభుదేవా మరోసారి తండ్రయ్యారనే వార్తలు గత కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఆయన రెండో భార్య హిమాని సింగ్ ఆడపిల్లకు జన్మనిచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ప్రభుదేవా స్పందించారు. తాను తండ్రయ్యాననే వార్తలు నిజమే అని చెప్పారు. ‘‘అవును, నా గురించి వస్తున్న వార్తలు నిజమే. 50 ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రయ్యాను. చాలా సంతోషంగా ఉంది. నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది’’ అని ఆయన చెప్పారు.




ఇప్పటినుంచి తన కుటుంబంతో గడపాలనుకుంటున్నట్లు ప్రభుదేవా చెప్పారు. ‘‘ఇప్పటికే నేను క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నాను. ఒకరకంగా చెప్పాలంటే పరిగెడుతున్నాను. అందుకే పనిభారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటిదాకా చేసింది చాలు.. ఇప్పుడు నా కుటుంబంతో కొంత సమయం గడపాలనుంటున్నాను’’ అని తెలిపారు. కాగా మొదటి భార్య రమలతకు 2011లో ప్రభుదేవా విడాకులు ఇచ్చారు. వీరికి ముగ్గురు కొడుకులు కాగా.. పెద్దబ్బాయి 2008లో మరణించాడు.



అప్పట్లో నయనతారను ప్రేమించిన ప్రభుదేవా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో రమలత నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు నయన్ - ప్రభుదేవా విడిపోయారు. అప్పటినుంచి సింగిల్గానే ఉన్న ప్రభుదేవా.. 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమాని సింగ్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరి బంధం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అయితే ప్రభుదేవా బర్త్ డే సందర్భంగా ఓ షోలో హిమాని ఓ వీడియో ద్వారా స్పెషల్ విషెస్ చెప్పింది. దీంతో వీరి విషయం అందరికీ తెలిసింది.


Updated : 12 Jun 2023 12:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top